అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్

85చూసినవారు
ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం పాతగుంటూరులో రూ. 46 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి, యూజీడీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పాత గుంటూరు ప్రజల సమస్యలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి పాలన చేస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్