రాజకీయ బిక్ష పెట్టిందే ఎన్టీఆర్: ఏపీ అసెంబ్లీ స్పీకర్

77చూసినవారు
రాజకీయ బిక్ష పెట్టిందే ఎన్టీఆర్: ఏపీ అసెంబ్లీ స్పీకర్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో అయ్యన్నపాత్రుడు పాల్గొని, ప్రసంగించారు. తనకు రాజకీయాల్లో ఏమీ తెలియనపుడే, నాకంటే పలువురు సీనియర్లు ఉన్నపుడు కూడ ఎన్టీఆర్ నన్ను నమ్మి మంత్రి పదవి ఇచ్చారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్