నీటిలో పడి మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేత

61చూసినవారు
నీటిలో పడి మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేత
భారీ వర్షాల కారణంగా నీటిలో కొట్టుకొని పోయి మరణించిన వ్యక్తి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆదివారం రామిరెడ్డి తోటలోని బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. వరదల కారణంగా జరిగిన నష్టం బాధాకరమని, బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్