రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా దహనం చేస్తున్నారు

1359చూసినవారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా దహనం చేస్తున్నారు
మా కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళనీకుండా పోలీసులు అడ్డుకోవడం దౌర్భాగ్యం అని గుంటూరు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ మండపడ్డారు. ఇటీవల పల్నాడు లో జరిగిన దాడుల్లో గాయపడిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన నాయకులను అక్రమంగా గృహనిర్బంధాలు చేయడం దారుణం అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఇలాంటి అరాచకాలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్