గుంటూరు: 22న విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నా: సీఐటీయూ

75చూసినవారు
గుంటూరు: 22న విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నా: సీఐటీయూ
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పాత గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో బుధవారం లక్ష్మణరావు మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు గడిచిన 8 నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయడం లేదని, పండగల సమయంలో పనిచేసినందుకు వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 22న ఎస్. ఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్