

గురజాల పరిధిలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో మొత్తము తొమ్మిది పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.