దాచేపల్లిలో కొవ్వొత్తులతో ర్యాలీ

76చూసినవారు
దాచేపల్లిలో సోమవారం రాత్రి కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ. అనేక రాష్ట్రాల్లో మహిళలను అతి కిరాతకంగా పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేస్తున్నారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్