గురజాల: మహిషాసుర మర్దినిగా అమ్మవారి దర్శనం

51చూసినవారు
గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం మహిషాసుర మర్దిని అష్టోత్తర దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సర్వ సుఖాలు కలుగుతాయని, ఇతి బాధలు తొలగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను అందించారు.

సంబంధిత పోస్ట్