ప్రాణం పోసే డాక్టర్ ను హత్య చేయడం దారుణం

77చూసినవారు
ప్రాణం పోసే డాక్టర్ ను హత్య చేయడం అమానుషమని పల్నాడు జిల్లా బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. కోల్కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తులతో దాచేపల్లిలో మంగళవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. ఇంత దారుణం జరిగినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తనకేం తెలియదు అన్నట్లు నిరసన ర్యాలీలో పాల్గొనడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్