కొరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి పై ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ హైవే అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు వెంబడి ఆగి ఉన్న లారీను ఢీకొని ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. అయినప్పటికీ వాహనదారులు లారీలను రోడ్డుపైనే ఆపుతున్నారు. దీనివలన ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు ప్రయాణికులు సోమవారం లోకల్ యాప్ వద్ద వాపోయారు.