మాజీ ఎమ్మెల్యే పిఏ కిడ్నాప్‌ కు యత్నం

85చూసినవారు
మాజీ ఎమ్మెల్యే పిఏ కిడ్నాప్‌ కు యత్నం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిఏను శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఆయన నివాసంలో ఉన్న ఎం.శ్రీనివాసశర్మను గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కారులో ఎక్కించుకొని వెళ్లారు. అయితే రాత్రి 8 గంటలు దాటిన తరువాత శ్రీనివాసశర్మ గాయాలతో ఇంటికి చేరుకున్నారు. పిన్నెల్లి ప్రత్యర్థులే ఆయనపై దాడి చేసినట్టు తెలిసింది. కిడ్నాప్‌ చేసిన తరువాత కొట్టి విడిచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్