రెంటచింతల: పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, అధికారులు

84చూసినవారు
రెంటచింతల: పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, అధికారులు
అంతర్గత రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం రెంటచింతల మండలంలోని పల్లెపండుగ కార్యక్రమం రెండు గ్రామాలలో నిర్వహించారు. మల్లవరంలో రూ. 10 లక్షలు, జెట్టిపాలెంలో రూ. 20 లక్షల ఉపాధి నిధులతో నిర్మించనున్న సిమెంటు రహదారులకు భూమిపూజ చేపట్టారు. కార్యక్రమంలో జయచంద్రకుమార్, మున్నా ప్రభురాజు, గొట్టం శ్రీనివాసరెడ్డి, మల్లయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్