నందిగం సురేష్ కు రిమాండ్ పొడగింపు

77చూసినవారు
నందిగం సురేష్ కు రిమాండ్ పొడగింపు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో 14 రోజులు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్