టిడిపి ఫ్లెక్సీలు చించేసిన గుర్తుతెలియని దుండగులు
ముప్పాళ్ళ మండలం తొండపిలో జరిగిన రాళ్ల దాడి అనంతరం అర్ధరాత్రి టీడీపీ ఫ్లెక్సీలు చించి వేశారు. టీడీపీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను రాళ్లదాడి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చింపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.