నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి

80చూసినవారు
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి, హత్య జరిగిన తీరును నిరసిస్తూ ఎస్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు బుధవారం నరసరావుపేటలో నిరసన తెలియజేశారు. స్థానిక ఎస్ఐసీ కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి, మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. డాక్టర్ హత్యను ఖండిస్తూ నిందితులను అరెస్టు చేసి మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్