పల్నాడు ఎస్పీని కలిసిన మిర్చి రైతులు

64చూసినవారు
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును సోమవారం పెదపాలెం, మునుగోడు మిర్చి రైతులు కలిశారు. తమ వద్ద తన్నీరు మార్కండేయులు, లక్ష్మీశెట్టి రవి కుమార్ అనే వ్యక్తులు మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టారని ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రూ. కోటి నలబై లక్షలు బకాయిలు రావాలని రైతులు తెలిపారు. బకాయి అడుగుతుంటే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్