పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

53చూసినవారు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి
పొన్నూరు పట్టణంలో పారిశుధ్యం, త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పట్టణంలో త్రాగునీరు పైపులైన్లను మరమ్మత్తులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. కమిషనర్ రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్