గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఎమ్మెల్యే బూర్ల

61చూసినవారు
గ్రామ అభివృద్ధికి సమన్వయంతో నూతన కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. బుధవారం వట్టిచెరుకూరు మండలం చమళ్లపాడు గ్రామ ధర్మ చెరువు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చైర్మన్ గా అరికపూడి బాల మురళీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ తో పాటు సభ్యుల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. గుంటూరు ఛానల్ నీటి యాజమాన్యంతో కొర్నెపాడు వద్ద లిఫ్ట్ నిర్మాణ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్