తుఫాను ప్రభావంతో చెరుకుపల్లి మండలంలో నేలకొరిగిన వరి పైరును మండల వ్యవసాయ అధికారి బాలాజీ గంగాధర్ మంగళవారం పరిశీలించారు. రైతులతో కలిసి మండలంలోని పలు ప్రాంతాలలో నేలకొరిగిన వరి పైరును పరిశీలన చేశారు. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు విచారం వ్యక్తం చేశారు. వరి పైరు పూర్తిగా నేలకొరిగిందని రైతులు ఆవేదన తెలిపారు.