జగన్ పై ధ్వజమెత్తిన సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా

74చూసినవారు
అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతిభ్రమించిందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. గుంటూరు కన్నావారితోటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో తట్ట మట్టి కూడా వేయలేదని ఆరోపించారు. జగన్ పాపాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తూ ప్రజలకు అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అప్పట్లో నీటిపారుదలశాఖని జగన్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్