నీటి గుంతలతో భూగర్భ జలాల పరిరక్షణ
భూగర్భ జలాలు పరిరక్షణకు నీటి గుంతలు ఎంతోగానో దోహదపడతాయని జిల్లా ఉపాధి పథకం ప్రాజెక్టు డైరెక్టరు గంగవరపు జోసఫ్ కుమార్ అన్నారు. బుధవారం శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా జరుగుతున్న నీటి గుంతల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పీడీ జోసఫ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1100 నీటి గుంతల ఏర్పాటుకు ఆమోదం పొందినట్లు చెప్పారు.