కొల్లిపరలో నేటి నుంచి గాలికుంటు వ్యాధికి టీకాలు

53చూసినవారు
కొల్లిపరలో నేటి నుంచి గాలికుంటు వ్యాధికి టీకాలు
మంగళవారం నుంచి సెప్టెంబర్ 18 వరకు పశువులకు వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణకు పశు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పశువులకు టీకాలు వేస్తారని కొల్లిపర మండల పశు వైద్యాధికారి డాక్టర్ సాయి సతీశ్ రాజు తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా గాలికుంటు వ్యాధి టీకాలు వేస్తున్నామన్నారు. కొల్లిపర మండలానికి 9, 750 డోసుల టీకాలు వచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్