సైకిల్ ఎక్కిన వైసీపీ కార్యకర్తలు

57చూసినవారు
సైకిల్ ఎక్కిన వైసీపీ కార్యకర్తలు
మాచవరం మండలం వేమవరం
గ్రామంలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం గురజాల ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్