పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం ఆయనే

59చూసినవారు
పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం ఆయనే
సీపీఎం నేత శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని చెప్పారు. పోలవరంపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడారు. నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. కమిటీ ఏర్పాటుతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్