ఏపీ సహా 8 రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10 నుంచి 20 రోజులు వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.