AP: రాష్ట్రంలో ఇవాళ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా, విశాఖ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 35.6 మి.మీ, కనేకల్ మండలంలో మి.మీ 17, గుమ్మగుట్ట మండలంలో 25.8 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.