పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

63చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సైనిక ఉద్యోగికి కేటాయించిన స్థలం విషయంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనిక ఉద్యోగికి కేటాయించిన స్థలంలో అంబేడ్కర్ బొమ్మను పెట్టారు. దీన్ని అడ్డుకున్న సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మిపై స్థానికులు దాడి చేశారు. దాంతో విజయలక్ష్మీ గాయాలతోనే నిరసన చేపట్టింది. సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులు, పోలీసులపై స్థానికులు రాళ్ల దాడి చేశారు.

సంబంధిత పోస్ట్