AP: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో జరిగిన సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెలసరి సమయాల్లో సిబ్బందిని శానిటరి ప్యాడ్లు అడిగితే పీరియడ్స్ చూపించమంటున్నారని బాలికలు వాపోయారని తనిఖీలు చేసిన వారు చెప్పారు. తల స్నానం చేస్తే రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపి చపాతీలు చేయిస్తున్నారని తెలిపారు. పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని చెప్పారు.