ఏపీలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,00,09,275 మంది కాగా, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ 3,482, సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 5.8 లక్షల మందికి ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఏపీలో వంద సంవత్సరాలు పైబడిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 7.88 లక్షల మంది ఉన్నారన్నారు.