రోడ్డు ప్రమాదం.. బయటపడ్డ నోట్ల కట్టలు

82446చూసినవారు
తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడులోడుతో వెళ్తున్న లారీ.. అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని బస్తాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ క్రమంలో ఏడు పెట్టెలు వాటితో పాటు ఉండటంతో స్థానికులు వాటిని తెరిచి చూడగా నగదు బయటపడింది. మొత్తం రూ.7కోట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ప్లయింగ్ స్వ్కాడ్ నగదును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్