ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. 'ఫుల్ జీతం తీసుకుంటా.. ఎందుకంటే ఏపీ ప్రజల సొమ్ము తింటున్నా అనే బాధ్యత అనుక్షణం నాకు గుర్తురావాలి. ట్యాక్స్ కడుతున్నాం.. పనిచేయాలని ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని ప్రశ్నించాలి. అందుకే జీతం తీసుకుంటా. నేను తీసుకునే దానికంటే వెయ్యి రెట్లు ఇస్తా' అని పవన్ తెలిపారు.