AP: రాష్ట్రంలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. "ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు తీసుకొచ్చాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు. సీవిజిల్లో వచ్చే ఫిర్యాదుల ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేశాం. 100% పోల్ అయ్యేలా కృషి చేస్తున్నాం." అని ఆయన మీడియాతో తెలిపారు.