చిన వెంకన్న ఆలయంలో అద్దెలు పెంపు

50చూసినవారు
చిన వెంకన్న ఆలయంలో అద్దెలు పెంపు
భక్తులకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ పాలక మండలి షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న ఆలయంలోని కళ్యాణ మండపాల అద్దెలను భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.800 గా ఉన్న అద్దెను రూ. 5వేల వరకు పెంచుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. పెంచిన అద్దెలపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలపాలని భక్తులకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్