ఏపీలో జ్యోతిష్యులకు పెరిగిన డిమాండ్

69చూసినవారు
ఏపీలో జ్యోతిష్యులకు పెరిగిన డిమాండ్
ఏపీలో జ్యోతిష్యులకు డిమాండ్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపోటములపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు. తమ జాతకం ప్రకారం విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకునే ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం తాను గెలిచే అవకాశం ఉందా? అంకెలు అనువుగా ఉన్నాయా? లేదా? అన్న విషయమై స్పష్టత తీసుకుంటున్నారు. దీంతో జ్యోతిష్యులకు ఏపీలో బాగా గిట్టుబాటు అవుతోంది.

సంబంధిత పోస్ట్