ఏపీలో పెరిగిన ఓటర్ల సంఖ్య

64చూసినవారు
ఏపీలో పెరిగిన ఓటర్ల సంఖ్య
ఏపీలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ నెల 2 వరకు కొత్తగా 1,26,549 ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389కు పెరిగింది. పురుషుల ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కి పెరిగినట్లు ప్రకటించింది. కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా అవకాశం ఉండటంతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్