రేపటి (సోమవారం) నుంచి రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్సుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఊరటనిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.