ఏపీలో భద్రత పెంపు.. ఆ ప్రాంతాలపై డేగకన్ను

72చూసినవారు
ఏపీలో భద్రత పెంపు.. ఆ ప్రాంతాలపై డేగకన్ను
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతుంది. అల్లర్లు సృష్టించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు డేగకన్ను వేశారు.

సంబంధిత పోస్ట్