AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావితం చేస్తున్నాయి. వివేకా హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షులంతా అనుమానాస్పదంగా మరణించడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసుకు ఉన్న లింకుపై డీజీపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించినట్లు తెలిసింది. చాలా క్లిష్టంగా మారిన ఈ కేసు.. అటు దర్యాప్తు సంస్థకు.. ఇటు ఏపీ రాజకీయాలకు సవాల్గా మారింది.