AP: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని
టీడీపీ నేత వర్ల రామయ్య ధీమా వ్యక్తం చేశారు. "అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన కోసం ప్రజలంతా ఓటు వేశారు. ఐదేళ్ల
వైసీపీ పాలనంతా తప్పులతడకే. అధికారం మార్పిడి తథ్యం. అధికారులు.. ఇప్పటివరకు చాలా తప్పులు చేశారు. ఈ సమయంలో ఏ ఫైల్ క్లోజ్ చేయడానికి వీల్లేదు." అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.