ఆవును కాపాడబోయి ఒకే ఇంట్లో నలుగురు మృతి

51చూసినవారు
ఆవును కాపాడబోయి ఒకే ఇంట్లో నలుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. జల్పాయిగుడి జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇంటి బయట నీటిలో పడి ఉన్న విద్యుత్ వైర్ ఆవుకు తగలడంతో దానిని రక్షించబోయి మిథున్(32), అతడి తండ్రి పరేష్(60), తల్లి దీపాలి (55) మరణించారు. ఈ క్రమంలో దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సుమన్(2) సైతం ప్రాణాలు వదిలాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్