విజయవాడలో వరద బాధితుల ఆందోళన

78చూసినవారు
విజయవాడలో వరద బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. వరద బాధితులకు రూ.602 కోట్ల పరిహారం అందించినట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్యూమరేషన్ జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని, వెంటనే పరిహారం అందించాలని కలెక్టరేట్ వద్ద వారు డిమాండ్ చేశారు. పోలీసులు గేట్లు వేసేందుకు ప్రయత్నించగా ప్రజలు తోసుకుని లోపలికి వెళ్లారు. బాధితులకు కమ్యూనిస్టు పార్టీల నేతలు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్