ఏపీలో ఎన్నికల ముందు వరకూ వైసీపీ టీడీపీతో పాటుగా జనసేనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇక ఎన్నికలు ముగిసాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ పవన్ ఎంతో హుందాగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు. వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒట్టు. ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయడంలేదు. దీనికి కారణం పవన్ను ఏమైనా అంటే ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బేస్తుందో జగన్కు తెలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.