నేరాలు, ఘోరాలు చేయడంలో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం రాతియుగంలోకి పోయిందని మండిపడ్డారు. వైసీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టో ఎంతో బెటర్ అని చెప్పారు. కూటమి గెలిస్తే అభివృద్ధి.. వైసీపీ గెలిస్తే అరాచకం వస్తుందన్నారు. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్ అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.