దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లో 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. టీసీఎస్లో 13,249 మంది, విప్రో 24,516, ఇన్ఫీ 25,994, టెక్ మహీంద్రా 6,945 మంది ఉద్యోగుల తగ్గుదల నమోదైంది. ఒక్క హెచ్సీఎల్లో మాత్రమే 1,537 మేర ఉద్యోగుల సంఖ్య పెరిగింది.