సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లిమర్లలో పవన్ తో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బాగు కోసమే భోగాపురం విమానాశ్రయం తెచ్చామని అన్నారు. మేం అధికారంలో ఉంటే అది పూర్తయ్యేదని తెలిపారు. ఎన్నికల్లో జగన్ ఒంటరిగా కాదు.. అహంకారంతో, అవినీతి డబ్బులతో వస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు.