100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. ఐదేళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.