పన్ను జరిమానాలపై ఢిల్లీ హైకోర్టుకు కాంగ్రెస్

56చూసినవారు
పన్ను జరిమానాలపై ఢిల్లీ హైకోర్టుకు కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ గతంలో చెల్లించాల్సిన ఆదాయపు పన్ను బకాయిల అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యూనల్ (ఐటీఏటీ) స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ న్యాయవాది వివేక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడంతో ఇది అత్యవసరంగా విచారించాల్సిన అంశమని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ మన్మోహన్ అంగీకరించారు.

సంబంధిత పోస్ట్