AP: మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుట్ర చేశారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాక్షిలో తప్పుడు వార్తలు రాయిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. "వంద గోవులు మరణించాయని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. టీటీడీపై భూమన కరుణాకర్రెడ్డి చేయని కుట్ర లేదు. తిరుమలలో గతంలో అన్యమత ప్రచారం చేశారు. గోవుల మృతి పేరిట నాటకం ఆడుతున్నారు." మంత్రి ఆరోపించారు.