ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం చెబుతున్న 99 శాతం హామీల అమలు బూటకమని ఆరోపించారు. అసత్యాలతో మోసగిస్తున్న జగన్కు ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వ అవాస్తవాలపై నిరసన తెలిపి పోరాటం కొనసాగించాలని
టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన
టీడీపీ శాసనసభా పక్షం భేటీలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడారు.