టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద కారు ఆపి నినాదాలు చేశారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ అంటూ నినదించారు. చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏం ఆశించడం లేదన్నారు. కాగా, సీట్ల కేటాయింపు విషయంపై టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి చంద్రబాబు నివాసంలో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.